శుక్రవారం, ఆగస్టు 29, 2014

ఆయనంతే, మొండోడు.. పిచ్చోడు..

చేతిలో సంచి, మాసిన గడ్డం, అడ్డపంచె, భుజంపై ఎర్ర తువాలు.. పాత తరం మధ్యతరగతి రైతు ఆహార్యంతో దాదాపు జీవితమంతా సంచారంలోనే గడిపిన ఎం.జె.ది అంతుపట్టని ఒక విలక్షణమైన వ్యక్తిత్వం.

రాయలసీమలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా విప్లవ ప్రజాసంఘాలతో పరిచయమున్న వారందరూ ఆయనను మహామొండి మనిషిగా గుర్తిస్తారు. ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఏ పిలుపులేకపోయినా ఎక్కడినుండో వచ్చి ప్రత్యక్షమవుతాడు. ..

బుధవారం, ఆగస్టు 20, 2014

నా కొడకా మానందీరెడ్డి....

పచ్చశత్రీ సేతబట్టీ…
కిర్రు సెప్పూలేసుకోని
కట్ట మీదా పోతావుంటేరో…

నా కొడకా మానందీరెడ్డీ
నువ్వు కలకటేరనుకొంటిరో…

శుక్రవారం, ఆగస్టు 15, 2014

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

అరెరే రాజారావు రావుబహద్దర్ నారసింహరెడ్డి
ఏయ్..రెడ్డి కాదు బంగారపు కడ్డీ.. నారసింహరెడ్డి

అరెరే.. ముల్కుల్ కట్టె సేతిలో
ఉంటే మున్నూటికి మొనగాడు
ఆ.. పెట్టి మాటలు ఏదాలోన రండి శూరులారా..

గురువారం, ఆగస్టు 14, 2014

పాలెకత్తె హొన్నూరమ్మ

ఒకరోజు హొన్నూరమ్మ ధరించి ఉన్న చీరను వలుచుకుని వెళ్లగలమని గొల్ల బోయలు హెచ్చరిక చేశారు. దానిని ఒక సవాలుగా తీసుకున్న హొన్నూరమ్మ ఆ రాత్రి కోటలో పహారా కట్టుదిట్టం చేసింది. అన్నమాట ప్రకారం గొల్లబోయలు ఆ రాత్రి మూడవ జామున తమ శక్తియుక్తులతో రాణి మహలులోనికి ప్రవేశించారు. ఒకడు ద్వారం వద్ద ఉన్న సిపాయిని కొట్టి వాని బట్టలు వేసుకుని నిల్చున్నాడు. రెండవవాడు హొన్నూరమ్మ నిద్రించు పట్టెమంచము ముఖమల్ పట్టుపరదాల వెనుక దాక్కుని సిద్ధం చేసుకుని తెచ్చిన చిన్న డబ్బాకు అడుగున సన్నని రంద్రం చేసి డబ్బానిండుగా నీటిని నింపి ఒక పొడుగాటి కర్ర చివరకు డబ్బాను వేలాడదీసి పైకి ఎత్తి పట్టి చాటుగా...

బుధవారం, ఆగస్టు 13, 2014

శ్రీభాగ్ ఒప్పందం

రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటిలో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.

ఆనాటి ఒప్పందంలో రెండు ప్రాంతాల నాయకులు అంగీకరించి సంతకాలు చేసిన తీర్మానము యధాతధముగా క్రింద ఇవ్వబడినది:

ఆదివారం, ఆగస్టు 10, 2014

పోటెత్తిన విద్యార్థులు...

వాళ్లంతా బడికి పోయే పిల్లోళ్ళు … కాలేజీకి పోయే యువతరం… అందరూ ఒక్కటై, ఒకే గొంతుకై వినిపించినారు రాయలసీమ ఉద్యమ నినాదం. ఆ నినాదం వెనుక దగాపడిన బాధ, పైకి లేవాలన్న తపన… అందుకు పోరు బాట పట్టేందుకు సిద్ధమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోరుగిత్తలు ఇచ్చిన ఈ పిలుపు మహోద్యమమై సీమ పాలిటి సైంధవులకు శరాఘాతమయ్యే రోజులు ...


శుక్రవారం, మే 16, 2014

'ఈనాడు' ప్రవచించిన 'కడపస్వామ్యం'

యావత్తు తెలుగు ప్రజానీకం అత్యధికంగా చదివే తెలుగు దినపత్రిక. పత్రిక యాజమాన్యం మాటల్లో చెప్పాలంటే "తెలుగు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా అహరహం తపించే పత్రిక ఇది". ఇంత పేరు గొప్ప పత్రిక ఒక ప్రాంతాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యానాలు రాయడం గర్హనీయం. ఇవాళ సంపాదకీయం (బాక్స్ చూడండి) పేర కడప జిల్లా పైన చల్లిన బురద చూడండి...

శుక్రవారం, మే 09, 2014

కడప జిల్లా పోలింగ్ విశేషాలు ...

కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్ వివరాలు. జిల్లావ్యాప్తంగా జరిగిన ముఖ్య ఘటనల వివరాలు ...

బుధవారం, ఏప్రిల్ 30, 2014

బాబూ! నీ హయాంలో కడప జిల్లా ఆం.ప్ర మ్యాపులో ఉన్నట్లు మీకు కనబడితే కదా!!

పందొమ్మిదేళ్ళ బాబు గారి హయాంలో వారి సారధ్యంలోని తెదేపా ద్వారా కడప జిల్లాకు ఒనగూరిన గుర్తుంచుకోదగిన ప్రయోజనాలు ఇవీ. వీటిల్లో సిమెంటు రోడ్లు వెయ్యటం, ఇంకుడు గుంటలు తవ్వటం, నిధులివ్వకుండా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చెయ్యటం, కాలువలు ఆధునీకరించడం లాంటి పెద్ద పెద్ద పనులు గుర్తుకొస్తాయి. కడప జిల్లాపై బాబుగారి చూపు ఎటువంటిదో తెలిపే కొన్ని ఉదాహరణలు ...

గురువారం, ఏప్రిల్ 17, 2014

విజయానంద్ ఐఏఎస్

పేరు : విజయానంద్ కే
విద్యార్హత : మెకానికల్ ఇంజనీరిగ్ లో ఎంటెక్ (జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం - అనంతపురం నుండి)
ఊరు : రాజుపాలెం (కడప జిల్లా)

శనివారం, ఏప్రిల్ 12, 2014

బుగ్గొంక - “నెహర్-ఎ-దావూదీ"

కడప నగరం మున్సిపాలిటీగా మారిన తర్వాత, ఎర్రముక్కపల్లె, నాగరాజుపేట, సున్నపురాళ్ళపల్లె, గుంతబజార్ ప్రాంతాలకు బుగ్గ నుంచి మంచి నీటిని గొట్టాల ద్వారా అందించే వారు. ఈ నీటి కోసమే తక్కిన ప్రాంతాల వారు కూడా పరుగులు తీసేవారు. ఈ నీరు రుచిగా ఉండటంతో పాటు, వారాల కొద్ది నిలువ ఉంచినా నీరు కలుషితం కాకపోవడం వలన అపురూపమైనదిగా భావించే వారు.

గురువారం, ఏప్రిల్ 10, 2014

K.S.జవహర్‌రెడ్డి ఐఏఎస్

K.S.జవహర్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పలు హోదాలలో విధులు నిర్వర్తించారు. K.S.జవహర్‌రెడ్డి ప్రొఫైల్, ఫోటోలు, ఇతరత్రా వివరాలు ...

మంగళవారం, ఏప్రిల్ 08, 2014

డిఎల్ సైకిలెక్కినట్లేనా!

దువ్వూరులో సోమవారం డిఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతోపాటు మైదుకూరు తెదేపా ఇన్‌ఛార్జి పుట్టాసుధాకర్‌యాదవ్, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన పరిస్థితులు అందరికి తెలిసిందేనని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా తెదేపా గెలుపునకు పాటుపడాలని పేర్కొన్నారు. 

సోమవారం, ఏప్రిల్ 07, 2014

ఎంపీ టికెట్ ఇస్తే నిధుల వరద పారిస్తా!

కడప లోక్‌సభ ఎన్నికల్లో గతంలో పలు అవకాశాలు తృటిలో జారిపోయాయని - తనకు ఎంపీ టికెట్ ఇస్తే నిధుల వరద పారిస్తానని చెప్పారు. 
మొత్తానికి లోక్ సభ అభ్యర్తిత్వం ఖరారైతే ఎన్నికలలో మరోమారు నిధుల వరద పారించేందుకు  కందుల సోదరులు సిద్ధమయ్యారన్నమాట! ఇప్పటికే డిఎల్ కడప తెదేపా లోక్ సభ అభ్యర్తిత్వం ఆశిస్తుండగా ఆశావాహుల జాబితాలో కందుల బ్రదర్స్ చేరారు. మరి బాబు ఈ అంశాన్ని ...

కడప జిల్లాపై చంద్రబాబుగారి వంకర చూపు

నష్టాల బాట పట్టాయని చెప్పి కడప సహకార చెక్కెర కర్మాగారాన్ని, ప్రభుత్వ ఆధీనంలోని ప్రొద్దుటూరు పాల కర్మాగారాన్ని మూయించేసి వాటిపై ఆధారపడ్డ ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూపకుండా వదిలేశారు. అదేమని అడిగితే సంస్కరణలు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నందలూరు ఆల్విన్ కర్మాగారాన్ని బాబుగారు 1999లో ప్రయివేటు పరం చేశారు.